పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

476

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


చెప్ప శక్యంబుగా దిప్పు డావ్యాసగు
        రుండు నాజిహ్వయం దుండి దయను


తే.

బరఁగఁ బలికించినట్లు నేఁ బలుకవలయు
ననుచు వ్యాసుని ధ్యానించి యచలుఁ డగుచు
శౌనకాదిమునీశ్వరసంఘమునను
జూచి సంతోషచిత్తుఁడై సూతుఁ డనియె.

212


సీ.

వేంకటాచలమందు విధిరుద్రముఖులకు
        హరి తాను బ్రత్యక్ష మైనయపుడు
కమలాసనుండు వైఖానససూత్రక్ర
        మంబుగఁ దా నర్చనంబు చేసి
మొనసి కన్యామాసమున రథోత్సవము గా
        వించె నాపిమ్మట విఖనసుండు
నర్చించె నమ్మునియాజ్ఞచేత మరీచి
        యర్చించె నటుమీఁద నత్రి పూజ


తే.

చేసెఁ గశ్యపుఁ డవల నర్చించె భృగుము
నీశుఁ డావనల నర్చించె నెల్లమునులు
పూజచేసిరి యావలఁ బొసఁగ యక్షు
లంత స్వాయంభువను మను నవలఁ జేసే.

213


సీ.

సమయంబునను సంధి సంవత్సరములతో
        మొనయు ముప్పదికోటు లెనుబదియును
నాలుగులక్షల నలువదియెనిమిది
        వేలయింటికి బ్రహ్మ విశ్వసృష్టిఁ
దాఁ జేయ నూహించి ధ్యానకాలముకోటి
        యవి డెబ్బదియు లక్షలనుచుఁ బలుకు