పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

478

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


మహిని స్వాయంభువుమనుకాల మీన్నియేం
        డ్లయ్యె నీక్రమముగ నబ్దసంఖ్య


తే.

తనర స్వారోచిషుండు నుత్తముఁడు తామ
సుండు రైవతుఁడును జాక్షుషుండుననెడు
పంచమనువులకాల మేర్పఱచి సంధి
యజ్ఞములతోడ నెక్కింప నవనియందు.

217


తే.

నయముగా నూటయేఁబదినాల్గుకోటు
లిరువదియు రెండులక్షలు నిదియుఁ గాక
యొక్కనలువదివేలయేం డ్లోజ యాయె
నవల వైవస్వతాఖ్య మన్వంతరమున.

218


క.

ఆవిధముగ నేక్షితిపై
నావేంకటశైలభర్త కానందముగా
నావైఖానసు లిపుడుసు
సేవించుచు నర్చనములు సేయుదు రెలమిన్.

219


సీ.

జగతిపై దివ్యవత్సరములు నాల్గువే
        లాకృతయుగమునం దమరి నడచు
నదిగాక తత్సంధి యగు నెనిమిదినూర్లు
        మొనసి త్రేతాయుగమునకు మూఁడు
వేలగు తత్సంధి వివరింప నాఱునూ
        ఱాద్వాపరంబున కసుపు నెంచ
నొకరెండువేలయేం డ్లొప్పఁగఁ దత్సంధి
        యబ్దముల్ నన్నూఱు నవలవచ్చు


తే.

కలియుగానికి వేయేండ్లు గాఁగ దాని
సంధిసంవత్సరంబు లెంచంగ ద్విశత