పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

475


తే.

మించి సిరిమీద నిటు తప్పు లెంచ కిపుడు
శాంతమును బొందు మీశుకాశ్రమతలంబు
విడిచి వోవల దనుచు వివేకసరణి
నన్నతోఁ గృష్ణుఁ డేకాంత మాడుచుండె.

209


సీ.

ఛాయాశుకుఁడు తనజనకుఁ డర్చించిన
        రామకృష్ణుల రమారమణి నచట
నర్చించుచుండఁగ నపుడు గన్యామాస
        మందు బ్రహ్మోత్సవం బద్రియందు
జరుపఁగా నట కేగి ఛాయాశుకుఁడు వీర
        లక్ష్మి సేవకులైన లలితమతులు
మొనసి తా నాకమాట యెనుబనిమందిని
        హరియాజ్ఞఁ బడసి వాహకులఁ జేసి


తే.

శుకపురము చేరి రామకృష్ణులను వీర
లక్ష్మి నర్చించుచుండె నుల్లాస మెసఁగ
నచట హరి నిల్పినటువంటి యజ్ఞసఖుని
జేరి వైఖానసులపూజ సేయుదురని.

210


వ.

ఇవ్విధంబున దేవదర్శనుండు దేశలునకుఁ జెప్పెనని సూతుం
జూచి శౌనకాదు లిట్లనిరి.

211


సీ.

ఓ సూత యాశ్రీనివాసుని శేషాద్రి
        యం దెవ్వరెవరు ము న్నర్చనములు
చేసి రాచందముల్ చెప్పఁగవలె నంచు
        నాశౌనకాదు లి ట్లడుగునపుడు
విని సూతుఁ డిట్లనె మునినాథులార మీ
        రతిశయప్రశ్న న న్నడిగినారు