పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

469


తే.

రమ్యమైయున్న పద్మసరస్సునడుమ
వెలయు నావీరలక్ష్మి తా వెడలి రాఁగఁ
బారిజాతము లాలక్ష్మిపైన నించి
చెలఁగి జయజయశబ్దముల్ చేసి సురలు.

189


చ.

పొగడుచు నుండగా జలధిపుత్త్రికదివ్యశరీరకాంతు లీ
జగతిని నిండి దిక్కులను సాంద్రముగాఁ బ్రసరించి పిమ్మటన్
గగనము నావరింప నదిఁ గాంచి ఫణీంద్రగిరీశ్వరుండు దా
ఖగపతి నెక్కి యచ్చటికి గ్రక్కున వచ్చెఁ బ్రమోదచిత్తుఁ డై.

190


క.

అప్పుడు బ్రహ్మ శివాదులు
తప్పక యచ్చటికిఁ బోయి తమ వాక్యతతుల్
గొప్పగ మొరయం జేయుచు
నుప్పొంగుచు లక్ష్మి లోచనోత్సన మెసఁగన్.

191


సీ.

చూచుచుఁ గార్తీకశుద్ధపంచమి యుత్త
        రాషాఢ భృగువార మమరఁ గూడి
యున్ననాఁ డరుదుగ వ్యూహమహాలక్ష్మి
        హరికి ము న్బ్రత్యక్ష మయ్యె నట్టి
విమలదినమునంద వీరలక్ష్మి ప్రసన్న
        మయ్యె నందఱకు మహాదినంబు
ముఖ్యం బనుచు బ్రహముఖ్యు లాలోచించి
        ఫణిగిరీంద్రుని జూచి పలికి రిట్లు


తే.

దేవ యీపుణ్యమైనట్టి తీర్థమందు
వెలయఁగా వ్యూహలక్ష్మియు వీరలక్ష్మి
వెడలివచ్చిరి గనుక నీవిమలతోయ
మవనిపైఁ బద్మతీర్థాఖ్య నమరెఁ బొగడ.

192