పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

470

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వ.

కావున నత్తీర్ధంబున స్నానమాచరించిరేని సౌభాగ్యసంపన్ను
లగుదురని నిర్ణయించి యందఱు స్నానంబుచేసి యప్పద్మ
తీర్థంబున కాగ్నేయభాగంబున దివ్యాలయంబు విశ్వకర్మచే
నిర్మితంబు గావించి యావీరలక్ష్మిని బ్రార్థించి తోడ్కొనివచ్చి
సకలలోకోత్సవంబులతో నాలయంబునం దుంచి ఛాయా
శుకునిచేతఁ బాంచరాత్రోక్తంబుగ సకలోపచారపూజలు
చేయించి రందుఁ జక్రి తనకంఠముననున్న పుష్పహారంబు
నవ్వీరలక్ష్మీకంఠంబునం దుంచి శుకాశ్రమంబు నగ్రహారంబు
గావించి ఛాయాశుకున కొప్పగించి బ్రహ్మాదులకు విందు
సేయించి వస్త్రతాంబూలంబు లిప్పించి సెలవిచ్చి వారి నంపించి,
వీరలక్ష్మితో నిట్లనియె.

193


సీ.

పద్మాలయా నీదు ప్రథమశరీరంబు
        కనుఁగొంటి కన్నుల కరువుదీఱె
నీవ్యూహలక్ష్మితో నెనసి వేంకటశైల
        మందుండ వచ్చు నీ వచటి కపుడు
రమ్మన నారమారమణి చక్రికి మ్రొక్కి
        పటుభక్తి దీపింపఁ బలికె నిట్లు
నాప్రాణనాయక నాకొఱకై నీవు
        తపము చేసిన మహాస్థలము గనుక


తే.

శ్రీకరంబైన దీశుకక్షేత్రమంద
నిలిచెదను నాహృదయములో నీవు నిలిచి
వ్యూహలక్ష్మి నురంబుపై నుంచుకొనుము
నన్నిచట నుంచి రక్షించు నలిననాభ.

194