పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

385


నెసలారఁ జేయని మ్మీ
వసుమతి నే నొల్ల నింక వనజదళాక్షా.

271


క.

అన విని హరి వసుథానుని
గనుగొని యిట్లనియె నిన్నుఁ గాంచిన జనకుం
డనఘుండై పరలోకం
బున కేగెను బిన్నతండ్రి పుణ్యముకొఱకై.

272


క.

ఘనగంగానది కరిగెద
ననుచున్నాఁ డిందు కిప్పు డాలోచన నిం
పొనరఁగఁ జెప్పుము నీ వన
విని వసుథానుండు పలికె వినయము దనరన్.

273


సీ.

హరి నీవు నను బ్రోవ నడ్డంబుగా రాఁగ
        నిరుపమచక్రంబు నిన్ను దాఁకె
నపుడు మూర్ఛిల్లితి వట్టిపాపము వోవ
        నింక నిందుండి రామేశ్వరమున
కరిగెద నగ్రజుఁ డైనట్టి మాతండ్రి
        పట్టంబుఁ బినతండ్రి గట్టుకొనుమ
టంచుఁ జెప్పుము మది నలరంగ ననఁగ నా
        శౌరి చూచి యగస్త్యసన్మునీశు


తే.

శుకమునీంద్రుని రావించి సకలవిషయ
ముల నెఱింగించి యెటు సేయవలయు ననిన
నవ్వి వా రిట్టు లనిరి శ్రీనాథ వీరి
కించుకేనియు నోపిక యెడఁదలేక.

274


సీ.

కాశీరామేశ్వరగతు లేల వీరికి
        నన్నదమ్ముల పాళ్లు నరసి మీరు