పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

384

శ్రీవేంకటాచల మాహాత్మ్యము


డుద్దండపరాక్రమంబు పెంచుకొని వాడిశిలీముఖంటు
లొక్కుమ్మడి వృష్టివలెఁ గుఱియింప నతండు రోషభీషణా
రావంబు సేయుచు హరియొసంగిన చక్రంబు వైవ నప్పు
డాచక్రంబు ప్రళయార్కబింబంబుచందంబున వచ్చుచున్నం
జూచి హరి కఱకుకోపంబున నతనికడ్డంబుగ నిలిచె నప్పు డా
చక్రంబు శ్రీనివాసునిపైఁ బడిన నాహరి మూర్చాక్రాంతుఁడై
రథంబుపైఁ బడుటం జేసి భీతిల్లి తొండవానుండు శస్త్రాస్త్రం
బులు విడచి నిజరథంబు డిగ్గి హరిరథంబుమీఁది కరిగి
పన్నీటం దడవుచుం దాలవృంతంబుల విసరుచుండె నపు డా
వసుథానుండుసు బాష్పపూరితాక్షుండై రథంబు దిగి హరిరథం
బుపై కరిగి కప్పురంపుపలుకులు నమలి చెవినూఁదుచుండ
శ్రీనివాసుండు కొండొకతడవుకు మూర్ఛ తెలిసి లేచి
కూర్చుండినం జూచి కరకమలంబుల మోడ్చి తొండవానుం
డిట్లనియె.

268


క.

హరి నే వసుథాసునిపై
నరిభీకరచక్ర మేసి నపు డడ్డముగా
సరగున నిల్చితి వందునఁ
బొరిఁ జక్రము దాక మూర్ఛఁ బొందితి వకటా.

269


క.

నీ కపకారముచేసిన
ప్రాకటపాపంబు నన్నుఁ బాయుటకొఱకై
జోకను గాశికిఁ బోవలె
నా కిప్పుడు సెలవొసంగు నళినదళాక్షా.

270


క.

వసుథానున కొగిఁ బట్టము
పస మీఱఁగఁ గట్టి రాజ్వపరిపాలన తా