పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

386

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


గగనాఖ్యనృపునిపా లొగిఁ బంచి యీవసు
        థానుని కిపు డియ్య ధర్మమగును
దొండవానుని పాలు తొండవానుని కీయు
        నట్లు సేయుట మంచిదగును వినుము
..................................................
        ..................................................


ఆ.

వేఱవిధము సేయ విధి తప్పునని మును
అపుడు వల్కఁ జక్రి యాసుధర్ము
సొమ్ము రెండుపాళ్లు చొప్పడ నొనరించి
వారి కిచ్చి మునులఁ బంపి యంత.

275


వ.

తాను వేంకటాద్రి కరిగి పద్మావతితో సంతసంబున నుండె.

276


తే.

అర్ధరాజ్యము వసుథానుఁ డలర నేలు
చుండఁగా నర్ధరాజ్యంబు తొండవాను
డేలఁగాఁ బుణ్యపరిపాకకాల మొదవ
నప్పు డానృపుఁ డాత్మ నిట్లని తలంచె.

277


ఉ.

వేంకటనాయకుండు మఱి విష్ణువ గాని నరుండు గాఁడు నే
మంకుగుణంబుచే మనుజమాత్రుఁడటంచుఁ దలంచుచుంటి నా
పంకజనేత్రుదివ్యపదపంకజముల న్మది నమ్మి భక్తిమై
నింక నిజంబుగా నతని నేర్పడఁ బూలను బూజచేసెదన్.

278


క.

ఆపరమాత్ముఁడు మనుజుం
డై పద్మావతిని గూడి యల్లునివలెఁ దాఁ
గాపట్యముతో మెలఁగుట
లీపట్లం దెలిసె నిందిరేశునిమహిమన్.

279