పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

380

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


మ.

అని నారాయణుఁ డానతీయఁగ మహాయాసంబుతో లక్ష్మి యి
ట్లనె నోనాథ భృగుండు నీయురమునం దజ్ఞానియై తన్నినం
దున నిచ్చో నిలువంగ లేక యట సంతోషంబుగా నిల్చి నే
ననిశంబు న్మదిఁ గుందుదాన నిఁక నే మందుం ద్రిలోకేశ్వరా.

255


శా.

కాలం బీగతిఁ జేసె నాభృగు ననంగా నేల నాయందు నీ
మేలైనట్టి దయారసం బిడినచో మేలొందుచు న్నుండెదన్
లీలామానుషవిగ్రహా యిఁక సదా లీలం దగంగన్య న
న్బోలె న్నామది కష్ట మియ్య వని నంభోజాక్ష మన్నింపవే.

256


క.

శ్రీ రాముఁడ వైనప్పుడు
వారక నే వేదవతిని వరకృతో నీ
వారయఁ గొనుమని చెప్పితి
వారీతం బెండ్లియాడి యైనది వేడ్కన్.

257


వ.

అని ప్రియోక్తులం బద్మావతిని గారవించి హరికి సంతసంబున
సేవఁ జేయుమని యనేకప్రకారంబులుగ బుజ్జగించి చెప్పి వకుళ
మాలిక నీక్షించి యిప్పడంతిని బోషించుచుండుమని నియమించి
హరికి మ్రొక్కి రమాదేవి కొల్లాపురంబు చేరి చక్రిని హృద
యకమలమునం దిడుకొని సుఖస్థితి నుండె నంత వేంకటేశుండు
అగస్త్యుని వీక్షించి యిట్లనియె.

258


తే.

సంయమీశ్వర వేంకటాచలము చేర
మేము వోయెద మని వల్కఁగా మునీంద్రుఁ
డనియె షాణ్మాసపర్యంత మహిగిరీంద్ర
మెక్కుదురె పెండ్లికొమరు లోయిందిరేశ.

259


క.

అనఘా షాణ్మాసంబులు
చను నంతకు నిచటనుండు సంతోషము చా