పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

381


లన విని వేంకటగిరిపతి
తనసతితో నచట నుండెఁ దద్దయు వేడ్కన్.

260


వ.

అంతం గొన్నిమాసంబులకు నాకాశరాజేంద్రుండు వైకుం
ఠంబున కరిగిన వసుధానుం డుత్తరక్రియ లొనర్చి దూత
మూలకముగ నారాయణవనంబునకు నవ్నార్త వినిపోయి
తొండవానుని విచారించి దుఃఖించుచుండిన పద్మావతి నూర
డించె ననిన విని శౌనకాదు లిట్లనిరి.

261


సీ.

ఆకాశరాజు శ్రీహరిపదంబునఁ జేరి
        విమలుఁ డైవోయినవెనుక యతని
తమ్ముఁడు తనయుఁ డిద్దఱు నుండి రందుఁ బ
        ట్టార్హుఁ డెవ్వం డయ్యె నావిధంబు
చెప్పు మటన్నఁ దా నప్పుడు సూతుండు
        మునులార నృపతమ్ముఁడు ధరిత్రిఁ
దన దైన నగనృపతనయుండు తమతండ్రి
        యేలిన రాజ్య మే నేలవలయు


తే.

ననిన విని తొండవానుండు నాగ్రహించి
పలికె నిరువురమునుగూడి భండనంబు
చేయుదము నీవు మించి గెల్చినను బృథ్వి
నీది నే మించి గెల్చిన నాది ధాత్రి.

262


క.

అని యిర్వురు పౌరుషముల
నెనయుచుఁ గయ్యం బొనర్ప నేతెంచి హరిం
గని తొండవానుఁ డనె ని
ట్లని వీర్యం బారఁ జేయు మని మఱి యనియెన్.

263