పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

372

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


బంధుమిత్రాదులకును సంపత్కరముగ
మంగళస్నానములను బొసంగ నపుడు.

224


వ.

చేయించి దంపతులుగం గ్రమంబుగ నుచితాసనంబుల
గూర్చుండఁబెట్టి భార్యయుం దానును వారివారిం దగు
మర్యాదవచనోక్తులం జందనపుష్పనూతనాంబరాభర
ణాదు లొసంగి ఫలతాంబూలంబుల నిచ్చె నంత నాఁటి
సాయంకాలంబున నలంకారయుక్తంబు నగు నైరావతంబున
హరిని సిరిని పద్మావతినిం గూర్చుండఁజేసి పురవీధులయందు
సంతసంబున నుత్సవం బొనరించి నిజమందిరంబునకుఁ జేర్చి
హరితోడవచ్చిన పరిజనంబులకు సంతసం బారఁ బసదనంబు
లొసంగి యనంతరంబు కృతార్థుండ నైతి నని నెమ్మదిఁ జెందె
నమ్మఱునాఁ డరుణోదయంబున హరి ప్రయాణోన్ముఖుండై
పద్మావతిం బంపుఁ డనిన నయ్యాకాశరా జిట్లనియె.

225


సీ.

శ్రీశేషగిరివాస శ్రీసతితోడ మీ
        రొక్కమాసం జైన నుండుఁ డిచట
ననుచుఁ బ్రార్థింపఁగ హరి యిట్టు లనియె నిం
        దుండగూడదు పను లుండు నచట
ననఁగఁ బద్మావతి నంపించువిధ మెట్లు
        పసిబిడ్డ యగు గాని ప్రౌఢ గాదు
గాన నే నిపు డంపలే నన్న విని చక్రి
        సిరిఁ జూచి కనుసన్న చేసె నపుడు


తే.

చక్రిభావంబు దెలిసి యాజలధికన్య
తాను నాకాశనృపుఁ జూచి తండ్రి పద్మఁ