పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

పంచమాశ్వాసము


జక్రితోఁ బంపవచ్చును సంతసంబ
మాకు నిప్పుడ మఱి చింత మీకు వలదు.

226


సీ.

వకుళమాలిక తల్లివలె బ్రోచు నచ్చోట
        నన్యు లెవ్వారు లేరని యనేక
రీతులుగా సిరి ప్రీతిమై పల్కఁగ
        నతఁడు సమ్మోదము నప్పు డొంది
సిరికిని దనయకుం జెలువారు దివ్యాంబ
        రాభరణంబు లొప్పార నొసఁగఁ
జేసి ముత్యంబులు చెలఁగి పుత్త్రికలకు
        నొడిఁబ్రాలుఁ గట్టించి యుల్లమలర


తే.

హరికి వస్త్రాభరణముల నలరఁజేసి
తనయ నాసిరి కొప్పించె నెనరు మించి
హరి మఱందికి వస్త్రభూషాదు లొసఁగె
వకుళ కాధరణీదేవి వఱలుగరిమ.

227


వ.

అమూల్యాభరణాంబరంబుల నలంకరింపఁజేసి ఫలపుష్పతాం
బూలాదుల నెలమి వఱలంజేసె నంత.

228


క.

గగనాధీశుం డంతట
జగదీశునిజెంతఁ జేరి సచ్చిత్తుం డై
నిగమాంతగుంభితోక్తులఁ
బొగడుచు మఱి యిట్టులనియెఁ బొలు పారంగన్.

229


సీ.

పెద్దకాలమునుండి బిడ్డలు లేకుండి
        గాంచితిఁ బద్మను గమలనయన
నీకన్య గల్గిన నెలమిచే వసుధానుఁ
        డుదయించె వానిని ముదముగాను