పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

371


తెచ్చితివి చెంబు దీనిచేఁ దీఱ దప్పు
రమ్ము మే మీయఁగలము వరాలు సామి.

221


ఆ.

గొల్లవారియిండ్లఁ గొల్లఁబెట్టుచుఁ బాలు
వెన్న మ్రుచ్చులించుచున్నబుద్ధి
విడున కూరివారి వేశ్మమునం దిట్లు
చెంబు దొంగిలింపఁ జెల్లదోయి.

222


వ.

అని యనేక ప్రకారంబులం బ్రియోక్తులం బ్రార్థించి పల్కినం
జూచి హరి చిఱునవ్వు నవ్వి పద్మావతి కరంబును బట్టుకుని
తొడయందుఁ గూర్చుండఁబెట్టుకొనఁగ నందుండు జను
లందఱు మందహాసంబులు చేసి రంత హరి పద్మావతి కరంబు
పట్టుకొనఁగ నందఱు వైభవంబున వివాహమందిరంబునకుఁ
దోడ్కొనివచ్చి యావలం గ్రమ్మఱ మంగళస్నానం బొనర్చి
వస్త్రభూషణాలంకృతుఁడై రమాపద్మావతులతో నవరత్న
పీఠంబునం గూర్చునియుండె.

223


సీ.

అల నాకబలి దేవతార్చనంబును నీల
        మణిధారణంబును మధురఫలము
లార్యులకొసఁగుట లైదువలకు శూర్ప
        దానముల్ సేయుట దనరగా వ
సంతోత్సవంబును సరవి దంపతులకు
        ఫలపుష్పతాంబూలములను బేళ్ల
నడిగి యిచ్చుట వార లానందముగఁ జెప్పి
        దీవించి పోవుట భావ మలర


తే.

నాంది వైసర్జనము చేసి నరధవుండు
వచ్చియుండెడు బ్రహ్మాదివర్యులకును