పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

370

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

మ్రొక్కు లిడి తనచేతికిఁ జిక్కినట్టి
కనకకలశముఁ గొని దొంగతనముగాను
బొరుగువారిల్లు సేరె నప్పుడు రయమున
నగజ మొదలగు నింతులు నగుచు లేచి.

217


తే.

కాంచి పద్మావతిని హరికడకు నెలమిఁ
దోడుకొని వోయి మోహము దొడరఁ జంద
నంబు నలఁదించి పుష్పహారంబు గంఠ
మందు నిడఁజేసి తాంబూల మలదె.

218


వ.

పట్టుకొను మని లజ్జమాని నాతోడ రమ్ము కోపం బేల యని
యడిగించి యిప్పించి రంత.

219


చ.

అన విని పెండ్లికూఁతురు మహాభయభక్తులు మానసంబునం
బెనఁగొన హాసచంద్రికలు బింబనిభాధరమందుఁ గ్రమ్మగాఁ
గనుఁగవ బెళ్కుముద్దుఁ గులుకంగ నిజేశుని మోము చూచి ల
జ్జను దలవాంచి చిల్కవలె జాణతనంబున నవ్వు చిట్లనెన్.

220


సీ.

ఆత్మేశ చోరుఁడ వై నీవు మాచెంబు
        దెచ్చినా వది యేమి చెప్పవోయి
మఱి యజ శివులముందఱఁ జిన్నపని నీవు
        చేసినదే చాలు చెప్పవోయి
అల లక్ష్మికిని నాకుఁ దలవంపుపని నీవు .
        చేసినకత మేమి చెప్పపోయి
ఘననాక బలికాలమునఁ దేఱ కీయల్కఁ
        జేసి వచ్చిన దేల చెప్పవోయి


తే.

దేవ పెండ్లికి నీ వప్పుఁ దీసినట్టి
ద్రవ్యమున కీడుగా దొంగతనము చేసి