పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

348

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


లాంఛనరచితవస్త్రయుగ్మంబును నారికేళంబును నిడి పూజింపఁ
జేయించి అఖండదీపంబు వెలుఁగఁజేసి తద్దీపంబునకు దీక్షార్చ
నలు చేయించి మ్రొక్కించిన వరాహస్వామిని హరి చూచి
యిట్లనియె.

149


సీ.

శ్రీవరాహస్వామి నీవును భూదేవి
        రావలె నిప్పుడు నావివాహ
మునకు నంచనఁగ నిట్లనియె నా దేవుఁడు
        క్షేత్రమంతయు ఫలించినది గనుక
రాఁ దీర దిపుడు నిర్ణయముగ నామాఱు
        వకుళయ పెండ్లికి వచ్చుఁ బొమ్ము
మనవుడు నటులైన నానతియ్యుఁడు పోయి
        వచ్చెద మని మెఱమెచ్చఁ బలికి


తే.

నంత బ్రహ్మను జూచి ప్రయాణభేరి
మొఱయఁజేయింపు మనఁగ నమ్ముదముఁ జూచి
బ్రహ్మ యిట్లనె నేమియో పరమపురుష
పరఁగ సంతర్పణంబు నెల్లరకుఁ జేసి.

149


వ.

రేపుదయంబు పైనం బొనరించుట శ్రేయంబు నేఁడు పైనంబు
గడుపందగదు. శుభాస్పదదినలాంఛనం బనఁగ నిదియ గదా
యనిన విరించిమాటలకు నంచితంబుగ హరి యిట్లనియె.

150


ఆ.

దేశకాలములను దెలియక యత్నంబు
నీవు సేయ నెంచినావు చూడ
నలర దొరకు నేపదార్థ మాయద్రిపై
ననినఁ జక్రి కిట్టు లనియె శివుఁడు.

151