పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

347


దివ్యభవ్యరత్నాంబరాభరణాదులు దెచ్చి లక్ష్మి కందియిచ్చె
నవి స్వామికి నాలక్ష్మియ యలంకారంబు చేసె నంత వసిష్ఠకస్య
పాత్రిభరద్వాజశుకవత్ససాదిమహామునులకుం జక్రి లోక
విడంబనార్థంబుగ సమస్కరింప నాసమయంబున వసిష్ఠుండు.

146


తే.

ముత్యముల చతురశ్రమముగ వివాహ
వేదిక రచించి యర్థి శ్రీవేంకటాద్రి
పతిని సతియగులక్ష్మిని పరఁగ నుంచి
తత్పురోభాగమున నగ్నిఁ దనరఁజేసి.

147


వ.

అంత యజుశ్శాఖోక్తప్రకారముగ వైఖానససూత్రపద్ధతిం
బుణ్యాహవాచనాదిశుభకృత్యంబు లాచరించి వచ్చిన యశేష
జనంబులకు సవినయోచితపూర్వకంబుగఁ దాంబూలాదు
లిప్పించి తదనంతరం బాహరిం జూచి కులదేవతారాధనంబు
సేయవలయు నయ్యధిదేవత నామం బెద్ది యని యడుగ
నాహరి పాండవులకును మాకును శమీవృక్షంబ కులదేవత
యనిన విని వసిష్ఠుం డయ్యవనీరుహం బెందుఁ గల దనఁగఁ
గుంభసంభవుండు విని యది కుమారధారాతీర్థంబున నున్న
దని వచింప నయ్యెడకు మంగళవాద్యంబులతోడ హరిం
దోడ్కొనివోయి యవ్వృక్షరాజంబునకుఁ బూజ లొనరిం
పించి ప్రదక్షిణనమస్కారాదులం జేయించి తత్పాదపశాఖా
గ్రపల్లవంబు లనుగ్రహించి హరి శిరంబున నునిచి యందుండి
వచ్చి కులదేవతకలశం బెందుండవలయు ననిన విని నార
దుండు వరాహస్వామినన్నిధానంబున నుండఁజేయవలయు
ననియె నంత నచ్చోట ముక్తతండులంబుల రాశింబోసి తత్క
లశంబున కలంకరించి యందుంచి తదుపరి హరిద్రంబునఁ బద్మ