పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

349


క.

చేసినయత్నము పూర్తిగఁ
జేసిగదా మేలు నెపుడు చెందవలయు నే
డీసంతర్పణ సేయక
గాలిసి యిపు డటకుఁ బోవఁగారాదు హరీ.

152


చ.

అని గిరిజాధిపుం డనఁగ నాహరి నవ్వి పొసంగ నబ్థిపు
త్త్రిని నడుగంగఁ బూనియు నిదేమి మగండయి సిగ్గుమాలి దా
నిని బతిమాల నేల యీపనికి నెమ్మి వరాల నొసంగు మంచుఁ బో
యనుచును శూలి నయ్యజుని నర్థి మెయిం గని గూడి గ్రక్కునన్.

153


వ.

వల్మీకసమీపంబునఁ గూర్చుండి యుండు పార్వతీభారతీ
ప్రముఖవరాంగనలనడుమం గూర్చునియుండు లక్ష్మీదేవి
తోఁ జెప్పకపోయి పుష్కరిణీతోర్థతీరవరాశ్వత్థపృషఛాయం
గూర్చుండి కుబేరుని రావించుకుని యేకాంతంబున నిట్టు
లనియె.

154


సీ.

ధనదావివాహయత్నము నేను జేసితి
        నర్థంబు లేదిపు డబ్ధిసుతను
నాపెండ్లి కీవు ధనం బిమ్ము మనుటకు
        నాకు నిష్టము లేదు నయము గాదు
నీవు ద్రవ్యం బిమ్ము నెఱి నీకుఁ బత్త్రంబు
        వ్రాసియిచ్చెదను సంవత్సరమున
కొకమాఱు వడ్డి నీ కొప్పించుచుండుదు
        గలియుగాంతమున నేఁ గాసువీస


తే.

మేమి నిల్పక యొసఁగెద నెడఁద నిదియు
మోసమని యెంచవలదు నాబాస గొనుము