పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


జేసి రమ్మనఁగ నా శ్రీలక్ష్మి హరి చెంతఁ
        జేరి నవ్వుచు రెండుచేతు లపుడు


తే.

పట్టి లేపగఁ దనమదిఁ బుట్టియున్న
చింత విడిచి ముదమున వసిష్ఠముఖ్య
మునుల కప్పుడు మ్రొక్కి. దీవనలు నంది
యొనర పీఠంబుమీఁదఁ గూర్చుండెఁ జక్రి.

138


వ.

అప్పు డరుంధతీప్రముఖసువాసినులు శోభనపాటలు పాడు
చుండ మంగళవాద్యంబులు మ్రోయుచుండఁ బార్వతియు
సావిత్రియు సరస్వతియుఁ గుంకుమోదకంబులు పైఁడిపళ్ళె
రంబుల నించి యారతు లిచ్చి రంత రమాదేవి మంగళాక్ష
తలు లలాటశీర్షంబులం దుంచికొని కర్పూరతాంబూలం బా
స్వామిచే నిచ్చి దీర్ఘనీలకుంతలంబుల చిక్కుఁదీయుచుఁ
బైఁడిగిన్నియలోని సంపెంగతైలంబుం జేత నిండం బట్టికొని
దీర్ఘాయుష్మంతుఁడవై యష్టపుత్త్రవంతుఁడవై చతుర్దశభువ
నంబు లనేకఛత్రాధిపత్యంబున నేలువాఁడవై వృద్ధినొందు
మోయంబుజాక్ష యని యాశీర్వదించి యభ్యంగనంబు
చేయించి కర్పూరకస్తూరి హరిద్రాచూర్ణములు పునుఁగు
తైలంబునం గల్పి నలుగు పెట్టి పరిశుద్ధోదకంబున నభిషేకం
బొనరించి కృతార్థురాలైతి నని సిరి మనంబున సంతసించె
నంత పార్వతీసావిత్రీసరస్వతులు కలశంబులఁ గుంకుమోద
కాభిషేకం బొనర్చి లక్ష్మితోడఁ బుడిసిళ్ల దత్తీర్థంబు వట్టి
శ్రీరామరక్ష యని శిరంబునకుఁ జుట్టి చల్లి రంత.

139


సీ.

సావిత్రి దెచ్చి వస్త్రం బియ్యంగా సిరి
        తడియొత్తె శిరమును దనర నివిరి