పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

345


చక్కనివెండ్రుకల్ చిక్కును సవరించి
        గంధపుసామ్రాణి కమ్రధూప
ము నొసంగెఁ బార్వతి ముదమునఁ బీతాంబ
        రము లియ్య హరి గట్టె రమణ మీఱ
శ్రీసరస్వతి దెచ్చి చేతి కీయఁగ లక్ష్మి
        వరరత్నభూషణావళు లమర్చె


తే.

ముకుర మటుమీఁద గాయత్రి మొనసి చూపెఁ
దిలకమును రతి రీతిగఁ దీర్చె నుదుట
రమ్యముగ శచి వింజామరమును వీచెఁ
బట్టె ఛత్రంబుఁ బవనునిపత్ని గరిమ.

140


తే.

పాదుకలు గంగ పెట్టఁగ బ్రహ్మసభకు
నడచుచును వచ్చి సింహాసనంబుమీఁద
నమరఁ గూర్చుండి మునిముఖ్యు లలరి చూడ
బ్రహ్మనుం జూచి శ్రీహరి పల్కె నిట్లు.

141


వ.

సురజ్యేష్ఠుఁడా! యిఁక లక్ష్మీదేవికి మంగళస్నానంబు సేయ
నియమింపు మనినఁ బద్మజుండు వోయి పార్వతీప్రముఖాంగ
నలం బిల్చి మజ్జననికి మంగళస్నానంబు సేయింపుఁ డని
వచించి లక్ష్మిని కనకపీఠికపైఁ గూర్చుండుమనిన శిరంబు వంచి
విరించితో సిరి యిట్లనియె.

142


క.

వనరుహభవ నే నభ్యం
గన మొల్లను మజ్జనంబు గ్రక్కున నేఁ జే
తును నని వల్కఁగ నది తా
విని సందియ మొంది యాదివిష్ణుం డనియెన్.

143