పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

343


పోయి మీమీపురంబులు సేరుఁ డెప్పటి
        పగిది వల్మీకగర్భంబునందు
నిలచెదఁ దల్లిదండ్రులు లేని పరదేశి
        వానికిఁ బెండ్లి కావలెనె యిప్పుడు


తే.

దిక్కులకు నేను దిక్కునై దిక్కు లేక
నొంటిగా నిల్చి తేఱ కామింటనుండి
మంటిపై వ్రాలి పొట్టకై మానవులను
జేరి యాచించి బ్రదుకుట సిద్ధమయ్యె.

135


తే.

ఇట్టి నాకు వివాహేచ్ఛ పుట్టఁదగదు
గనుక యభ్యంజనము నొల్ల ననఁగ బ్రహ్మ
దేవుఁ డదరుచు శ్రీస్వామిదిక్కు చూచి
పాదముల వ్రాలి యిట్లని పల్కె నపుడు.

136


వ.

దేవా మహాలక్ష్మి మీకు నిత్యానందదాయినియై పత్నియై
యుండి నేనును మన్మథుండును బుత్త్రులమై తక్కినరుద్రపవ
నేంద్రాదులు మనుమలై మునిమలై వృద్ధినొందుచుండఁగ
నందఱకు నాధారభూతమై కూటస్థబ్రహ్మంబైన నీకు విచారం
బేల యని సాభిప్రాయంబుగఁ బల్కిన విని హరి యిట్లనియె.

137


సీ.

అంబుజాససచేతఁ దాంబూల మిపు డిచ్చి
        నన్ను దీవించు మానందముగను
నా కిప్పు డభ్యంగనముచేయువార లె
        వ్వారంచుఁ జింతతో నీరు కనుల
నింపంగ సిరి హరినిం జూచుచుండఁగఁ
        దమ్మిచూలి మఱప్డు నెమ్మి సంజ్ఞఁ