పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


ఉ.

పాడి తలంగకుండఁ దొలి పద్మజుఁ డాడినరీతి నల్దిశల్
పోఁడిమిఁ గుంకుమం బిడినఁ బుణ్యశుభోదకకుంభము ల్దగన్
వేడుక మీఱ నుంచి సరవి స్వరసూత్రము చుట్టి యైదువల్
జోడుగ దానిమధ్యమున శోభితసన్మణిపీఠ ముంచగన్.

132


ఆ.

అజుఁడు పెండ్లిపీఁటయందుఁ గూర్చుండుఁ డో
స్వామి యనఁగఁ జక్రి జలధికన్య
దెసను జూడ విష్ణుదేవుని మో మెట్లు
చూడ కాదిలక్ష్మి చోద్యముగను.

133


సీ.

చెక్కిట చెయిఁ జేర్చి శిర మొగి వంచి ప
        దాంగుష్టమున సున్న లవనిమీఁద
వ్రాయుచు మఱి చింత చేయుచు నెమ్మోము
        చిన్న చేసుకుని యందున్న వేడ్క
లైనఁ జూడకయుండినట్టి రమాసతిఁ
        దాఁ జూచి హరి యిట్లు దలఁచె మదిని
నేఁ బెండ్లియాడుట కీయిందిరకుఁ జింత
        గల్గుచున్నది సేయుకార్య మేమి


తే.

యనుచు యోచించి తనచింత నడచి సరవి
వాలుగన్నుల నారమావనితమోము
సారెసారెకుఁ జూచుచు జాలినొంది
పద్మసంభవు నీక్షించి వలికె నిట్లు.

134


సీ.

ధాత యీపెండ్లియత్నము చేసి యేనొప్పి
        నందుచేఁ దప్పు నాయందుఁ గల్గెఁ
గాన నా కీపెండ్లి గావలసిన దేమి
        నేనొల్ల మీరెల్ల వేడుక గని