పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

341


గావున నాపెండ్లి నీ విప్పు డొప్పి చే
        సిన మేలె చేయకుండినను మేలె
నా కేమి గావలె లోకవిడంబనా
        ర్థంబుగ నీప్రయత్నంబు నేఁడు


తే.

కాలకర్మానుగుణముగఁ గల్గె ననుచుఁ
దాను గన్నీరు నించిన ధవుని జూచి
వల్కె సిరి యిట్లు దేవ యీపామరంబు
నీకుఁ దగ దని చాల మన్నించి నగుచు.

129


సీ.

హరి నాదరించి బ్రహ్మాదుల నీక్షించి
        యిది యేమి యాలస్య మెల్లవారు
లేచి మీమీపనుల్ చూచి చేయుఁడు చక్రి
        కభ్యంగనము సేయుఁ డనుచు లక్ష్మి
యానతియ్యగ నంద ఱన్ని పను ల్జేసి
        రపు డబ్జజుండు ఖగాధిపతిని
పన్నగేంద్రానిలప్రముఖులం బంపించి
        పుణ్యతీర్థముల నా భుజగగిరికిఁ


తే.

గలశముల నిండఁ దెప్పించి క్రమముగాను
గుంకుమను గల్పి నాల్గుదిక్కులను బెట్టి
సూత్రముల వానిచుట్టుసు జుట్టుఁ డనుచు
నతఁడు సెప్పఁగ గిరిజాముఖాంగనలును.

130


తే.

మంగళస్నానములు చేసి రంగు మీఱ
వస్త్రభూషణములు దాల్చి వచ్చి దీప
కలశము ల్మంగళారతు ల్కరములందుఁ
బట్టి కల్యాణపాటలు పాడు చెలమి.

131