పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తెఱవ మిన్నా! విను మెఱుకులవారికి
        నిండ్లెందుఁ గలవు భూమీశవనిత


తే.

గుడిసె లాడాడఁ గావించి కొన్నిదినము
లుండిపోయెడువారల కూరు దేశ
మేల యీయూరిదయితల కెఱుక సెప్ప
వలసి వచ్చితి వింటె మాకులగతులును.

19


సీ.

ఎఱుకవారలకెల్ల గుఱికట్టుగా నిల్వ
        నొక్కచోటున్నది నిక్కముగను
నది యేడనన్న నాల్గాఱును బదియుఁ బం
        డ్రెండుపదాఱును రెండునైన
శృంగపంక్తులుచేత నింగి కెగురుచుండు
        నాఱుకొండలకు మీ దైన కొండ
వేయు శృంగము లొప్పు వీక్షింపఁ దగుకొండ
        మూఁడేళ్లతో గూడి మొనయుకొండ


తే.

నాల్గుత్రోవలకును నట్టనడిమి కొండ
పాము తనలోన నుండఁగఁ బ్రబలు కొండ
మేటి కరువలిఁ దనరారి మెఱయు కొండ
తొంటి మా పెద్దలున్నట్టి దొడ్డకొండ.

20


క.

ఆతొండమీఁద నిక్కము
మాకాఁపుర మెపుడు చెలఁగు మఱి జీవికకై
లోకుల కెఱుకలు సెప్పుచు
జోకుగఁ బ్రదుకుదుము మేము సోదె లడుగుమా.

21


క.

చెప్పెద ముంతెడు ముత్తెము
లిప్పించుము నాకు ననుచు నెఱుకత తనతోఁ