పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

309


జెప్పఁగ నానృపసతి విని
యప్పుడ ముత్యము లొసంగె యానందముగన్.

22


తే.

పసిఁడిచేటలోని పండుముత్తెంబు లా
గద్దె పొలఁతి సూచి కరము సాఁచి
ముత్తెములను బిసికి మూఁడురాసులు చేసి
మధ్యరాశియందు మనసు నిల్పి.

23


వ.

ముమ్మాఱు నారాసికిం జేనెత్తి మ్రొక్కి నోట గంగాపుణ్య
తీర్థంబులను గాశీగయాప్రయాగప్రముఖపుణ్యక్షేత్రంబు
కను, హరిహరబ్రహ్మాదిదేవతలను, బరాశక్తిప్రముఖానేక
శక్తులను వచించుచు మ్రొక్కి మఱియు నిట్లనియె.

24


క.

విను ధరణీసతి యిచటికి
నెనరున దేవుళ్లు వచ్చి నిలిసిరి నీ విం
కను దక్షిణతాంబూలం
బును గొనిరా మ్రొక్కు గద్దె బుట్టను దనరన్.

25


వ.

అనిన విని దక్షిణతాంబూలంబులు వెట్టి గద్దెబుట్టికి
మొక్కులిడి యెఱుకలసానితో ధరణీదేవి యిట్లనియె.

26


తే.

కొమ్మ నామదిలోనుండు గోర్కె నీవు
చెప్పు నీ కొడుకున కందె లొప్ప నిత్తు
దివ్యాంబరంబుల నెమ్మి నిత్తు
దబ్బరాడకు నెఱుకత తలఁచి నుడువు.

27


క.

అని పల్కఁగ రాణిం గనుఁ
గొని యెఱుకత యిట్టు లనియెఁ గొడుకా మదిలో
ననుమానింపకు మిప్పుడు
ఘనతగ నీకోర్కెఁ జెప్పఁగల నెసలారన్.

28