పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

307


తెఱవ లైనట్టివారికీ నెఱుక చెపుచుఁ
బొట్టఁ గడుపుచు నుండుదు పొలఁతులార.

14


తే.

అనిన వా రిట్టు లనిరి మాయమ్మ కెఱుక
నిజముగా నీవు చెప్పిన నీకు రత్న
భూషణా లిచ్చి బంగరుపుట్ట మిచ్చి
పొమ్మనును నీ క విప్పింకఁ బూట మేము.

15


మ.

అని వా రాసతి కాస్తలై పలికి నెయ్యం బొప్పఁగా దాని దో
డ్కొని యంతఃపురమందుఁ జేర్చి రచటం గూర్మిన్ ధరాకాంత దా
నిని బంగారపుఁబీటపై నునిచి మన్నింపంగ నీక్షించి యి
ట్లనె నాసోదెలసాని నవ్వుచు మహాహ్లాదంబు దీపింపఁగన్.

16


తే.

వనిత నీవు భాగ్యవతి నేను గడుపేద
దానఁ గాన నాకు దనయునకును
బాలు బువ్వ బెట్టి మేలైన విడము నా
కిచ్చి యడుగు మెఱుక యెలమి గులుక.

17


క.

అప్పుడు క్షీరాన్నంబును
దెప్పున బిడ్డఁడును దానిఁ దిని లేచి ముదం
బొప్పఁగ ధరణీదేవిని
గప్పురవిడె మిమ్మటంచు గ్రక్కున నడిగెన్.

18


సీ.

ఆయెఱుకలసాని కాధరణీదేవి
        విడె మిచ్చి పల్కె నో వెలఁది మీఁది
యేదేశ మిపుడు మీయిం డ్లేడ నుండు మీ
        యూరుపే రేమి మాయూరి కేల
వచ్చితి వనఁగ నవ్వనితను జూచి సో
        దెలసాని నవ్వుచుఁ బలికె నిట్లు