పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


యొప్పమి గల్గునట్లు తప్పక గుఱిమీఱి గొట్ట నాహరిమీఁద
శిలావృష్టి గురిసె. నప్పు డప్పద్మాక్షుండు కార్యము తప్పెనని
తలంచె. నప్పు డప్పొలంతులు పాటవంబున మీటు ఱాల
పోటులు నాట ఘోటకంబును దాఁటి పోనేరక నేలంబడియె.
నంత శ్రీకాంతుండు హయంబును డిగి యూతక వారిం
జూచుచుండ నాబోటులు వాటంబుగ ఱాలనంది మఱి మఱి
రువ్వుచుండిరి. ఆఱాలవ్రేటులు దప్పించుకొనుచు నిలువనేరక
యుత్తరాభిముఖుఁడై వేంకటాచలంబునకు నెగనెక్కుచుం
దనకు నివాసంబైన వల్మీకంబునం బ్రవేశించి వకుళమాలిక
నిర్మించిన విరులపాన్పుపైఁ బ్రళయకాలంబున మహాబ్ధి
యందు వటపత్రంబునఁ బరుండిన పరమపుర్షునిచందంబున
శయనించియుండె. అంత నిక్కడ వనమధ్యంబునందుఁ జెలులం
జూచి పద్మావతి యిట్లనియె.

289


సీ.

చెలులార మాతల్లి చెప్పినమాటలు
        వినకుండ వచ్చి యీవిధముగాను
అనుభవించితిఁ గష్ట మమ్మమ్మ నేఁ జెల్ల
        నీ పుష్పవనమున కింక రాను
జాలు నిచ్చోటను శబరుఁ డాడినమాట
        లప్పు డమ్మకు మీరు చెప్పవలదు
చెప్పిన మన కెల్ల సిగ్గుపా ట్లగునని
        పలికి యందల మెక్కి చెలులతోడఁ


తే.

గుసుమఫలములఁ గొన్ని చేఁగొనుఁడటంచుఁ
బోయి మణిమందిరము చేరి పూలఁబండ్లఁ