పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

279


నావల నేమగు ననఁగ నాపద్మాక్షి
        యిట్లనె నావేంకటేశుఁ డుండ


తే.

కంచి శ్రీవరదుఁడు రంగఁ డంచితులయి
యుండఁగా నీకు నాతండ్రి యొప్పి దాన
మిచ్చునే పొమ్ము నీకేల యిట్టి భ్రాంతి
కానికార్యంబునకు నీవు పూన నేల.

283


వ.

అనిన విని చక్రి యిట్లనియె.

284


క.

పోపొ మ్మని మొగమాటం
బీపట్లను నీకు లేక హెచ్చుగ నాపైఁ
గోపము చేసితి వని నిను
బ్రాపించక నేను బోను పద్మదళాక్షీ.

285


క.

అనఁగాఁ బద్మావతి యి
ట్లనెఁ దలిదండ్రులను విడచి యకటా నీ వి
ట్లనుట యసంభావితమై
చను మూరక లేనిభ్రాంతి సమకొన నేలా.

286


వ.

అనిన నాదైత్యారి మందస్మితవదనారవిందుండై యిట్లనియె.

287


చ.

విను సతి నీవు నా కిటు వివేకము చెప్పితి వెంత చెప్పినన్
వనజభవుండు నానుదుట వ్రాసినవ్రాఁతఫలంబు దప్పునే
నిను వరియించి పిమ్మటను నే నెటు వోయినఁ గాని సేమమే
గనుక నిజంబుగాను నినుఁ గౌఁగిటఁ జేర్పకపోను జేడియా.

288

పద్మావతి హరిపై ఱాలను రువ్వించుట

వ.

అని పల్కుచు డగ్గఱకు వచ్చుటం జూచి పద్మావతి కోపో
ద్రేకియై చెలులం బిలిచి యీదుష్టుని ఱాలం గొట్టి దూరం
బుగఁ దఱుముఁడనిన వార లప్పుడు తెప్పున ఱాల నందికొని