పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సీ.

అని చక్రి వలుకఁగ నతివ యిట్లనియె నీ
        వీలీల మోదుగుపూలు వేసి
పలుమాఱు నాకుఁ గోపంబు పుట్టించెద
        విఁక జీవితెఱువు లేదేమొ నీకు
ఛీ పొమ్మనఁగ హరి చిఱునవ్వు నవ్వుచు
        ననె జనించినవారు చనుట నిజము
గనుక చిం తెక్కడఁ గలసినపిమ్మట
        జగతి నుండిన మేలె చనుట మేలె


తే.

రమణి నా కందుకై విచారంబు గలదె?
వినుము తలఁచిపని యైనవెనుక నీవు
పట్టి కొట్టిన దిట్టిన భయము లేదు
వేఱమాటలు వల్కకు వెలఁది నీవు.

279


వ.

అనిన విని పద్మావతి యిట్లనియె.

280


క.

నాకడ నీ విటు ప్రేలుట
యాకాశనృపాలుఁ డెఱుఁగ నంతట ని న్నీ
లోకంబున మననీయఁడు
పో కష్టం బేల దూరముగ మేలొందన్.

281


వ.

అనిన విని హరి నగుచుఁ బద్మావతి కిట్లనియె.

292


సీ.

పుట్టినవారెల్లఁ బోవుట నిజమైన
        దెఱుఁగుదు నేను ని న్నెట్టులైన
విడువను నీతండ్రి విమలధర్మాత్ముండు
        గాన న న్బాధింపఁ డైనఁగాని
బాధింపఁ జూచెద భయము లేదు మఱేమి
        ప్రియముగ నా కిచ్చి పెండ్లి సేయ