|
నావల నేమగు ననఁగ నాపద్మాక్షి
యిట్లనె నావేంకటేశుఁ డుండ
|
|
తే. |
కంచి శ్రీవరదుఁడు రంగఁ డంచితులయి
యుండఁగా నీకు నాతండ్రి యొప్పి దాన
మిచ్చునే పొమ్ము నీకేల యిట్టి భ్రాంతి
కానికార్యంబునకు నీవు పూన నేల.
| 283
|
వ. |
అనిన విని చక్రి యిట్లనియె.
| 284
|
క. |
పోపొ మ్మని మొగమాటం
బీపట్లను నీకు లేక హెచ్చుగ నాపైఁ
గోపము చేసితి వని నిను
బ్రాపించక నేను బోను పద్మదళాక్షీ.
| 285
|
క. |
అనఁగాఁ బద్మావతి యి
ట్లనెఁ దలిదండ్రులను విడచి యకటా నీ వి
ట్లనుట యసంభావితమై
చను మూరక లేనిభ్రాంతి సమకొన నేలా.
| 286
|
వ. |
అనిన నాదైత్యారి మందస్మితవదనారవిందుండై యిట్లనియె.
| 287
|
చ. |
విను సతి నీవు నా కిటు వివేకము చెప్పితి వెంత చెప్పినన్
వనజభవుండు నానుదుట వ్రాసినవ్రాఁతఫలంబు దప్పునే
నిను వరియించి పిమ్మటను నే నెటు వోయినఁ గాని సేమమే
గనుక నిజంబుగాను నినుఁ గౌఁగిటఁ జేర్పకపోను జేడియా.
| 288
|
పద్మావతి హరిపై ఱాలను రువ్వించుట
వ. |
అని పల్కుచు డగ్గఱకు వచ్చుటం జూచి పద్మావతి కోపో
ద్రేకియై చెలులం బిలిచి యీదుష్టుని ఱాలం గొట్టి దూరం
బుగఁ దఱుముఁడనిన వార లప్పుడు తెప్పున ఱాల నందికొని
|
|