పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

249


తనమం దప్పుడు తాన దెచ్చుటకుఁ బ్రాతఃకాలమం దొక్కఁడే.

179


సీ.

అరుగునప్పుడు వరాహస్వామి వృషభాసు
        రునితోడఁ బోరాడి దునిమివైచి
యవల భూదేవితో నఖిలపర్వతగుహ
        సానుశృంగములందు సంచరెంచి
బహువత్సరములకుఁ బన్నగాద్రిఁ దలంచి
        మఱలివచ్చుచు నున్నమార్గమునను
నరునిచందమున శ్రీహరి నిల్చియుండఁగఁ
        గని నరుంబోలి రక్కసుఁ డొకండు


తే.

క్రచ్చరం జూచి పోరాడ వచ్చినాఁ డ
టంచుఁ గడునట్టహాసంబు మించి చేసి
దిగ్గజంబులు మూర్ఛిల్ల దృఢముగాను
ఘుర్ఘురారావ మొనరించె ఘోరముగను.

180


క.

ఆరభసంబున కులుకుచు
నారాయణుఁ డదిరి చూచి సనపొదలోనన్
దూఱుకొనంగాఁ గని యా
దారిని గిటిదేవుఁ డరిగి దర్పము మీఱన్.

181


క.

ఘోరాకారుం డగుచును
గోరులు గీటించి యంత గొబ్బునఁ బొదలో
చూఱున ఘోణిం గని యపు
డూరక యొకమూల విష్ణు వొదుకుచు నుండెన్.

182


వ.

అట్లుండి కన్నీళ్లు నించుచుండ నతనిదీనదశం జూచి దనుజుండు
గాఁడు దనుజాంతకుం డని తెలిసి నిష్కారణంబుగ నితని