పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


చంద్రుఁడ వల్మీకవాసియగు శ్రీనివాసుఁడు, తదనంతరంబు
వసుదేవుండ తింత్రిణీతరువు, దేవకిదేవియ వల్మీకంబు, బల
భద్రుండ పన్నగాచలంబు, మధురానగరంబె వేంకటగిరి,
యమునానదియ స్వామిపుష్కరిణి, యాదవులె మృగంబులు,
గోపికలె ఖగంబులు, కృష్ణుండె వల్మీకవాసి యగువేంక
టేశుండు, మఱియు వైకుంఠంబ నిగమమయం జగు శేషా
చలంబు, విరజానదియ సువర్ణముఖరి, నారాయణుండ లీలా
మానుషవిగ్రహుం డైన శ్రీనివాసుఁడు, అచ్చట ననేక
ముక్తబ్రహ్మ లనేకఖగంబులై యనేకముక్తరుద్రులు మృగం
బులై సనకసనందనాదులు వనచరులై వర్తించుచుండఁగఁ
బరమపుర్షుండైన వేంకటేశ్వరుం డందు విచిత్రలీలావినోదం
బులం గ్రీడించుచుండియుఁ దనకు శరీరబాధ గల్గినట్ల మాయగా
నటించినాఁ డింతియగాని యమ్మహానుభావున కాబాధ లేదు.
మీరలు నెమ్మదిగ వినుండు, ఆస్వామిని దర్శింప వచ్చినవారు
సకలసత్కర్మసిద్ధులం బొందుదు రని చెప్పి సూతుండు
వెండియు శౌనకాదుల కిట్లనియె.

177


శా.

వైకుంఠంబును వీడి శేషగిరిపై వల్మీకగర్భంబులో
శ్రీకాంతుండు వసించి చేసిన మహాచిత్రంబుల న్వింటి రిం
కాకంజాక్షుఁడు మర్త్యుఁడై నరులలో నాటాడె నాచందమున్
మీకుం గొంచె మెఱుంగఁజేసెదను నెమ్మి న్వీనులం బట్టఁగన్.

178


మ.

వినుఁ డానిర్జరదేశికుండు హరికిన్ వే నొప్పి వారింపఁ జె
ప్పినపాల్దూదియఁ దెచ్చి గాయముపయిం బెట్టెన్ హితుం డొక్కఁడై
నను లేకుండఁగ నేమి సేతు నని శ్రీ నారాయణుం డార్తుఁడై