పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


యందుఁ గోపంబు చేసితినని మనంబున వగచి బాష్పపూరిత
లోచనుండై యందుండు లీలామానుషవిగ్రహుని చెంతఁ జేరి
యోడకు మని యిట్లనియె.

183


సీ.

వైకుంఠ మెడఁబాసి వచ్చినగతి యేమి
        సిరి యురంబున లేనిచిత్ర మేమి
మానవాకృతి నిందుఁ బూనియుండుట యేమి
        తలమీఁద గాయంబు దగులు టేమి
యుడిగినబలముతో నొదుగుచుండు టిదేమి
        గన్నుల బాష్పముల్ గారు టేమి
నేను వచ్చినయప్డు నిల్చి పల్కక నాకు
        లోగిన ట్లడవిలో డాఁగు టేమి


తే.

వింతగాఁ దోఁచుచున్న దీవిధము నాకుఁ
దెలుపు నిక్కంబుగా నంచుఁ గలఁత నొంది
యడుగ నఱమఱలేక దీనాస్యుఁ డగుచు
నిమ్మెయిం బల్కె నాతని కిమ్ము మెఱసి.

184


సీ.

విను ఘోణిరూప నావృత్తాంతమంతయు
        వైకుంఠమున నుండ శ్రీకలితుఁడయి
యప్పు డాభృగుమౌని యక్కునఁ దన్నె నా
        యందు నుండినలక్ష్మి యపుడు చూచి
పరపుర్షుఁ డేతెంచి పాదంబునం దన్ని
        నట్టియెడంబాసి యరుగుదాన
నంచుఁ గొల్లాపురం బందుఁ జేరినయంత
        వైరాగ్యమును బొంది వచ్చి తిటకుఁ