పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


జ్ఞానము నెపు డొసఁగుము
నే నీపదమందె నిలుతు నీరజనయనా.

121


క.

అనుచు రమాకాంత మనం
బునఁ గోపము గదుర వల్కఁ బురుషోత్తముఁ డా
వనజాలయతో నిట్లనె
గనుఁగొని ప్రియమార నయముగా వినుమనుచున్.

122


క.

సిరి నన్ను మౌని దనుట
కరమరగాఁ జూడవలవ దమ్మునిపాదం
బురమునఁ దాఁకినదే శుభ
కరమయ్యెను గోపగింపఁగాఁ దగ దింతీ.

123


చ.

అన విని లక్ష్మి యిట్లనియె నాత్మల కాత్మవు విశ్వకారణుం
డననిను బూజసేయ కిపు డక్కట యిక్కడ వచ్చి తన్నె న
మ్ముని కిఁక నేమి గల్గు నతిమూర్ఖుఁడు వానిఁ దలంప నింక నా
మనమున కింపుగాను బహుమానము చేసితి వీవు కేశవా.

124


సీ.

తనతండ్రి యైనవిధాత నీకు సుతుండు
        తా నావిధాతకుఁ దనయుఁ డయ్యె
దనకుఁ బితామహుం డని యెంచి పిన్నపె
        ద్దంతరమును జూడ కదరఁ దన్నె
నది యటులుండంగ నమ్ముని పరమాత్మ
        వని నిన్నుఁ దెలియలే కజ్ఞుఁడయ్యె
నటువంటిమునిపాద మిటు నీయురంబున
        సోఁకినంతటన యిచ్చోట నిలువఁ


తే.

దగదు సెలవైన నేను జిత్తమున నిన్ను
నిల్పి పూజించుచుండుట నీతి నాకు