పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

231


జ్జను దలవాంచి యిట్లనియె శాశ్వతసద్గుణమూర్తి వీవు గా
వున నను బ్రోచి తిందు నిఖిలోన్నత నిన్ను నుతింప శక్యమే.

118


వ.

అని వినుతించి హరిని వీడ్కొని చని గంగానదీతటంబునం
గ్రతువు లొనరించుచున్న కశ్యపాదిమునివర్యులచెంతఁ జేరి,
అజరుద్రుల రజస్తమోగుణస్వరూపంబులను హరిశుద్ధసత్వ
గుణస్వరూపంబును దాఁ బరీక్షించి వచ్చినవృత్తాంతంబు
లమ్మునివర్యులకు వినిపింప వారు సంతసించి నారాయణుం
డొక్కఁడ ముక్తిప్రదుండని నిశ్చయించి సకలక్రతుపుణ్య
ఫలంబు లాస్వామికి నర్పించి విష్ణుధ్యానంబు సేయుచుండి
రంత.

119


సీ.

వనజాక్షు నాభృగుముని దన్ని నప్పు డా
        హరివక్షమున లక్ష్మి యలరుచుండి
తననివాసమునందుఁ దన్నినభృగునిపై
        నలుక రెట్టింపఁగ హరికి మ్రొక్కి
పలికె నిట్లని నిన్ను బ్రహ్మస్వరూపుఁడ
        వని నమ్మి నీయురంబునను నిల్చి
యిరవుగ నుంటి నేఁ డీభృగువర్యుండు
        న న్నెంచకుండఁ దాఁ దన్నెఁ గనుక


తే.

యతఁడు తన్నుట సంతోషమయ్యె నీకు
నాకుఁ గోపము పుట్టియున్నది మునీంద్రు
నేమి సేయుట కిష్ట మొక్కింత లేదు
గానఁ దప మాచరించెదఁ గమలనాభ.

120


క.

మానసమున మీపదములు
ధ్యానింపుదు నెచ్చటైనఁ దద్దయు నెపుడున్