పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

215


తనయుఁ డైనట్టి మాధవనామధేయుండు
        తనకర్మవశమునం దనకు భార్య
యగుచంద్రరేఖను బగలు రతికిఁ బిల్వ
        నయ్యింతి భీతితో నకట పెద్ద
లింటనుండఁగఁ బగ లీరతి తగదంచు
        బహువిధంబులఁ జెప్పి పట్టుపడక


తే.

తలఁగిపోవుచు నుండఁగఁ దాళఁజాల
కతఁడు ప్రార్థింపఁగాఁ బతియాజ్ఞ మీఱఁ
దగదటంచును మది నెంచి ధవునిమోము
సదయమైఁ జూచి పల్కె నాచంద్రరేఖ.

68


వ.

స్వామీ దేవతార్చనాగ్నిహోత్రాదిసత్క్రియ లాచరించు
సమయంబున నిట్లు దివాక్రీడాసక్తిఁ గడంగఁగూడునే యని
యనేకవిధంబులం జెప్పినను వినకుండు పతిం జూచి, “యైన
మీరు సమిత్కుశతులసీపుష్పార్థంబుగ సువర్ణనదీతీరవనంబు
నకుం జని యందుండుఁడు. నే నచ్చటికి నుదకంబు గొనివచ్చు
టకు ఘటంబు చేఁగొని వత్తు నచ్చట మర్మస్థానంబున భవ
త్సంకల్పపూర్తిం జేసికొనుఁ డటంచుం బతికి ముదంబు నొం
దించి యాతని పంప నతం డట్లు పోయి సువర్ణనదీతీరంబునం
బుష్పవనాంతరంబు చేరె. అచ్చటికి నంతకుమున్న వచ్చి స్వర్ణ
భూషణశ్వేతాంబరాలంకృతయై యొక్కకాలు ముడిచికొని
యొకకాలిబొటనవ్రేలి నేలఁ గ్రుత్తి యెత్తుచు మోఁకాలి
మీఁదఁ జుబుకం బుంచుకొని దీర్ఘనీలకుంతలంబులు మెఱయఁ
గూర్చునియున్న పద్మినీజాతి యగు చండాలస్త్రీనిం జూచి
యమ్మాధవాభిఖ్యవిప్రుండు మోహించియుండె. నట్టిసమయం