పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


హంబులు మృగసమూహంబులై పితృగణంబులు ఖగగణం
బులై యక్షకిన్నరులు పాషాణరూపులై యుండఁగ శేషునకు
వరం బిచ్చి వోయిన పరమేష్ఠి శేషాద్రియందుఁ బ్రవేశించి
యుండుఁ డని వరాహస్వామిని ప్రార్థింప నద్దేవుండు వైకుంఠ
పురంబున నున్న క్రీడాద్రిని గరుడునివలనఁ దెప్పించి శేషాద్రి
యందుంచి తా నండు వసియించియుండఁగ నాస్వామికిఁ బూర్వ
భాగముననున్న శ్రీస్వామిపుష్కరిణి గంగాదిపుణ్యతీర్థంబు
లకు జన్మస్థానంబై మకరమత్స్యకచ్ఛపాదిజలచరావాసంబై
కమలకుముదాదిపుష్పరాజివిలాసంబై సరస్వతీసరోవరంబని
చెప్ప నొప్పుచుండె. నప్పుష్కరిణియందుఁ గ్రుంకులిడినజనులు
పాపరహితు లయ్యెద. రదియునుంగాక ధనుర్మాసంబున శుద్ధ
ద్వాదశీదినం బరుణోదయంబు మొదలుకొని యారుగడియల
పర్యంతము గంగానదు లాపావనపుష్కరిణియందుం గలసి
యుండు, నట్టిపుణ్యకాలంబున నాతీర్థంబున స్నానంబు చేసిన
వారలు ముక్తినొందెద. రదియునుంగాక, తత్తీర్థతీరంబున
శ్రాద్ధంబులు చేసిన వారిపితృదేవత లమృతపానం బొనర్చి
తృప్తినొంది స్వర్గంబున కేగి సుఖంబుండుదురు, మఱియు
నారాయణాఖ్యుండను బ్రాహ్మణుం డాతీర్థంబునం గ్రుంకు
లిడుచుండి హరిదివ్యధామంబునం బొందె. నిది శేషాద్రి
ప్రభావం బిఁక వేంకటాద్రిప్రభావంబు వచింతు.

67

మాధవుండను విప్రునిచరిత్రము

సీ.

చెప్పెద వినుమయ్య శ్రీకాళహస్తిలోఁ
        జూడఁ బురందరసోమయాజి