పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


బునం దనభార్య యుదకార్థంబుగ ఘటంబుం జేకొనివచ్చుటం
జూచి యవ్విప్రుండు భార్యా! నీగుణంబును బరీక్షింప దివా
క్రీడకుఁ బిలిచితింగాని మఱేమియు లేదు గావున నీవు స్నానం
బొనర్చి యుదకంబు గొని గృహంబున కేగు మేను నతిశీఘ్రం
బుగ వచ్చెదనని భార్యను బంపి యాచండాలస్త్రీకడకుం బోవు
చుండ నాబ్రాహ్మణునిం జూచి యది లేచి మ్రొక్కి దూఱం బరిగి
నిలిచి యేమో చెప్పఁబోవ నవ్విప్రుం డద్దానిచెంత కేగుచుం
డఁగ నాస్త్రీ భయంపడి మాధవాభిఖ్యబ్రాహణున కిట్లనియె.

69


సీ.

ధరణీసురేంద్ర నే దవ్వునం జనుచున్న
        నేల వెంబడివత్తు వేమినీతి
న న్నెవరని యెంచినావు నీ వెఱుఁగుము
        చండాలయువతిగఁ జనుము విప్ర
యనఁగ నాబ్రాహ్మణుం డనియె నీపే రేమి
        చెప్పవే యనఁగ నాచేడె వానిఁ
గని నన్నుఁ గుంతల యని పిల్తు రిట్లు నీ
        వడుగుచు ననుఁ జేర కవలఁ బొమ్ము


తే.

నీవు నాడగ్గఱకు రాకు నీచజాతి
దాననని వోవుచుండఁగఁ దాను దాని
విడిచిపోలేక మఱిమఱి వెంబడించి
భ్రాంతితో నిట్టు లనియె నాబ్రాహ్మణుండు.

70


తే.

భామ నీవంటిసుందరి బ్రహ్మదేవుఁ
డంత్యజాతిని బుట్టించి యడవియందుఁ
గాచువెన్నెలవడుపునఁ గనుట చేసె
నింత కావిధి దూఱంగ నేల మగువ.

71