పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

201


భాసురుండు నమస్కరించి యనేకవిధంబుల నుతించిన నయ్య
మరారింజూచి నరహరి యిట్లనియె.

25


క.

విను దానవ నీతపమును
గని మెచ్చితి వరము లెవ్వి గావలె ననఁగా
విని వృషభాసురుఁ డపు డి
ట్లనె నానరహరిని గాంచి యానందమునన్.

26


సీ.

పరమాత్మ నాకంబు బ్రహ్మలోకముగాని
        యేనొల్ల నాహవం బెందుగాని
తగఁజేయవలె నవతారము ల్పది తొల్లి
        యెత్తినప్పుడు గల యెలమిబలము
నొక్కఁడవే పూని చక్కఁగ నాతోడ
        సమరంబు సేయు మోస్వామి యనిన
విని వానియవివేకమునకు నవ్వుచు విష్ణు
        వనె నిట్లు కదనంబు వలచి తీవు


తే.

గాన నిచ్చెద రమ్మన దానవుండు
గట్టు పైఁబడినట్టుగ నట్టహాస
మురుతరంబుగఁ జేయుచు నొరిమ విడచి
కదిసినం జూచి హరి వాని నదును నెంచి.

27


వ.

ఇవ్విధంబున నిర్వురు సింగంబులభంగి నింగి కెగసి నేల నిల్చి
యొండొరుల డాయుచుం బాయుచుం బలుతెఱుంగులైన
నాయుధంబులచేతఁ గొట్టుచుఁ గరికరి హరిహరి గిరిగిరి పొరి
పొరి నొరసి పోరుకరణి ననేకప్రకారంబుల విడివడి నడువం
బుడమి గడగడ వడంక వడిఁబెడగ బడలక జలంబులానం
దడవక కడువడి పిడుగులుపడువడువునం దొడరి పెనునగవుల