పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


నొండొరులు మెండొడ్డి వెఱ్ఱిచూపుల నిక్కి వెక్కిరించు
కొంచు ధిక్కరించుచుఁ గక్కసంబడి నిక్కి హుంకారంబులు
సేయుచు నహంకారంబులు పెంచుచుం గేకలు వేయుచు
లోకభీకరంబుగ మేఘంబులవలె నుఱుముచు గండసిలలు
బెండువడి తండోపతండంబులై బెడబెడఁ బొఱలివచ్చి మెండు
బండలపైఁ బడి రెండేసిఖండంబు లగుచుండఁగఁ గొండ
కొండకుం జంగున నెగిరి లంఘించునట్లు బహువిధంబుల భండ
నంబు సేయుచుండి రంత, నవసానంబున మలఁగుదీపం బధికంబుగ
వెలుఁగుఁజూపినచందంబున వృషభాసురాంగబలంబు ప్రచం
డోద్దండంబై నిండిన నరకంఠీరవుని మించి కబళించుకైవడిం
గానవచ్చినం గని వెఱఁగుపడి యమరులు నభోమార్గంబున
నుండి నరహరివిజయంబుం గోరుచుండి రప్పు డప్పరమపురుషుం
డుప్పొంగి రక్కసునిం గనుంగొని ఱొప్పుచుఁ దెప్పున గరుడ
వాహనారూఢుండై సహస్రాయుధంబులు ధరించి దైత్యుని
పైఁబడి పట్టి కొట్టవచ్చినం జూచి రాక్షసుండు మిట్టవడి పట్టు
వడక యట్టిట్టు జుణుఁగుచు నాఖండలాదినిర్జరభ్రాంతికరంబైన
తనమాయాబలంబున ఖగవాహనారూఢుండై సహస్ర
భుజుండు సహస్రాయుధధరుండై కృత్రిమవిష్ణురూపధారిని
నిర్మించి నారసింహునిఁపైఁ బురికొల్పె నప్పు డమ్మాయావిష్ణు
రూపంబు మహావిష్ణు నెదిరించి పోరవచ్చినంగాంచి చక్రి యది
రాక్షసకృత్యం బని తలంచి నిజమాయం బెంచి యమ్మాయకృత్రి
మవిష్ణురూపధారిని మాయంబు చేసి నగుచు నిట్లనియె.

28


సీ.

చపలరాక్షస నిన్ను సరిచేసుకొని పోర
        వలసి పోరితి నింతవట్టు కీవు