పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


బ్భావనచేత వాఁడు ననుబట్టుగనంతటఁ జూచుచుండు మీ
రావిధమున్ గ్రహించి చనుఁ డక్కడనిక్కడ నుందు నెంచఁగన్.

193


తే.

పుణ్యతమమైన నైమిశారణ్యభూమి
కరుగుఁడని మౌనివర్యుల కానతిచ్చి
మౌనముద్ర ధరించి యాశ్రీనివాసుఁ
డప్పు డర్చాకృతిం దాల్చె నద్భుతముగ.

194


తే.

అప్పు డందు శిలావిగ్రహంబుకరణి
నమరియుండిన శ్రీవేంకటాద్రివిభుని
చూచి మునిపుంగవులు కడుచోద్య మంది
పూర్ణభావనచే హరిం బొగడి రిట్లు.

195


శ్లో.

సరోజపత్రలోచనం సుసాధులోకపావనం
చరాచరాత్మకప్రపంచసాక్షిభూతమవ్యయమ్,
పురారిపద్మజామరేంద్రపూజితాంఘ్రిపంకజం
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్.

పురాణపూరుషం సమస్తపుణ్యకర్మరక్షణం
మురాసురాదిదానవేంద్రమూర్ఖదర్పభంజనమ్,
ధరాధరోద్ధరం ప్రశాంతతాపసాత్మవీక్షణం
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్.

శరాసనాదిశస్త్రబృందసాధనం శుభాకరం
ఖరాఖ్యరాక్షసేంద్రగర్వకాసనోగ్రపానకమ్,
నరాధినాథవందితం నగాత్మజాత్మసన్నుతం
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్.

సురారిశౌర్యనిగ్రహం సుపక్వరాట్పరిగ్రహం
పరాత్పరం మునీంద్రచంద్రభావగమ్ విగ్రహమ్,