పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

189


వినుతించుచుఁ బంచాబ్దము
లొనరఁగ శేషాద్రియందు నుండిరి వేడ్కన్.

189


క.

అటుపిమ్మట మౌనుల వేం
కటగిరినాథుండు చూచి కమణను మీ రి
చ్చట నుండ నేల దడయక
పటుతర మగునాశ్రమములఁ బడయుఁడు చనుఁడీ.

190


సీ.

అని యప్పు డానతిచ్చిన వేంకటేశ్వరు
        నకు శ్రీకి భూనీళలకును మ్రొక్కి
వదలిపోవుటకును మదిరాక హరిమోము
        లోచనోత్సవముగఁ జూచి చూచి
యానందబాష్పంబు లక్షుల వెడలంగ
        నిగమాంతసూక్తులఁ బొగడి పొగడి
తనియ కాస్వామి సుందరరూపమును జిత్త
        నీరజాతములను నిల్పి నిల్పి


తే.

తన్మయత్వంబు నొంది యాతపసు లప్పు
డాయనంతుని విశ్వమోహనుని బాయఁ
జాల కందుండి యందఱు సనకయుండఁ
జూచి యిట్లనె యప్పద్మలోచనుండు.

191


తే.

పరమమునులార నిర్గుణబ్రహ్మమైన
నేను సగుణవిలాసము ల్మానవులకు
జూపి రక్షింపఁదలంచి యిచ్చోట నిలిచి
యుండ నిట్లుందు నంతట నిండియుందు.

192


ఉ.

కావున మద్వియోగ మొగిఁ గల్గదు పూర్ణవివేకి కంతటన్
నావిమలస్వరూపమును నాటఁగఁజూపుచు నుందుఁగాన స