పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

191


ధరామరాఘశోషణం సుధాతరంగభూషణం
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్.


వ.

అని యివ్విధంబున సంస్తుతించి పుసఃపునఃప్రణామంబులు చేసి
వేంకటాచలంబును డిగి కపిలతీర్థమార్గంబున నిర్ణమించి యగ్గిరి
కిం బ్రదక్షిణపూర్వకంబుగ నరుగుచుం దలకోనాఖ్యస్థానం
బున ననేకవత్సరంబులు తపంబుననుండి యందుండి లేచి సురా
ఘటక్షేత్రంబున కరిగి యందుఁ గొన్నిమాసంబు లుండి యందుండి
గోదావరీతీరంబునం గొన్నిదినంబు లుండి యందుండి నైమిశా
టవి కరిగి యచ్చట దమయుచితస్థానంబులం జేరి సూతుం జూచి
వెండియు నిట్లనిరి.

196


క.

సూతా నీకరుణను వి
ఖ్యాతిం దగు వేంకటాద్రి కరిగితి మచటన్
బ్రీతిగ నీ వెఱిఁగించిన
రీతుల మే మెల్లి దద్గిరిం గంటి మొగిన్.

197


శా.

ఆహా నీసకలజ్ఞవాక్కులకు మాకానందము బుట్టె నీ
మాహాత్మ్యం బధికంబు చూడఁగను సామాన్యుండవే సూత మా
తో హెచ్చై తగినట్టిచిత్రములు సంతోషంబుగాఁ జెప్పిన
ట్లా హైరణ్యగిరీంద్రమందుఁ గల వీ వం దెట్లు గన్గొంటివో.

198

మునులు సూతుని నుతించుట

సీ.

భర్మాద్రికరణి నప్పర్వతం బున్నది
        చైత్రరథమురీతి సద్వనంబు
గన్పట్టుచున్నది ఖగమృగాదులు జాతి
        వైరము ల్విడిచి యవ్వనమునందుఁ