పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


ప్రీతిని బాదరాయణుఁడు పెంపు వహించి గ్రహించినట్టి వా
గ్వ్రాతము నీకుఁ జెప్పుటను వాసిగఁ జెప్పితి వీవు మాకొగిన్.

166


సీ.

సంతోషమయ్యె వేదాంతవేద్యుండైన
        వేంకటేశార్చనావిభవములను
మాకుఁ దెల్పుమటన్న మది సంతసించి యా
        సూతుఁ డిట్లనియె సంప్రీతి మెఱయ
ననఘాత్ములార మీ రడిగినవిధముగ
        ఘనుఁడైన శేషుని కపిలగురుఁడు
ముదముమై నడుగ నిమ్ముగ శేషుఁ డనె నిట్లు
        మునినాథ విను మది మోదమునను


తే.

గురుతరంబు హరిప్రీతికరము పరమ
కోపదూరము పరితాపపాపహరము
రమ్య మష్టోత్తరశతంబు కామ్యఫలద
మగుచు దీపించు నది యెట్టులనిన వినుఁడు.

167


తే.

స్వర్ణనదిఁ బుట్టినట్టి సువర్ణకమల
జాలమును దెచ్చి వేంకటేశ్వరుని బ్రహ్మ
దేవుఁ డష్టోత్తరశతంబు నై వెలుంగ
నామములఁ బూజచేసె సానందుఁ డగుచు.

168


తే.

స్వామిచే సర్వలోకపితామహుండు
సకలకామ్యార్థముల నంది సంతసించె
నట్టి యష్టోత్తరశతంబు నైన నామ
ములఁ బఠించుట కెవరైన ముందుగాను.

169


వ.

ప్రణవపూర్వకంబుగ శ్రీ వేంకటేశాష్టాక్షరీమంత్రరాజంబు
న్యాసయుక్తంబుగ జపంబొనర్చి హరికి సమర్పించి తదనంత