పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

183


రంబు ధ్యానావాహనార్ఘ్యపాద్యాచమనస్నానవస్త్రయజ్ఞోప
వీతగంధాక్షతపుష్పాదులు సమర్పించి, వేంకటేశాష్టాక్షరి
మంత్రంబు జపించి యష్టోత్తరశతనామంబుల నర్చించుచుఁ
బాదాదిశీర్షపర్యంతంబుగ సర్వాంగార్చనంబు సేసి ధూపదీప
నైవేద్యతాంబూలసువర్ణపుష్పకర్పూరనీరాజనమంత్రపుష్ప
ప్రదక్షిణనమస్కా రంబులు సమర్పించుచుఁ దదైశధ్యాననిష్ఠుం
డైనభక్తునకు నావేంకటేశ్వరుండు ప్రసన్నుండై యైహికా
ముష్మికఫలంబుల నిచ్చు. నీయష్టోత్తరశతం బత్యంతగోప్యంబు
నగు శ్రద్ధాభక్తులు గలవాఁడై గురువిశ్వాసంబు గల్గి తద్గురు
ముఖంబుగఁ దెలిసి పఠించినవాఁడు కృతార్థుం డగు నంచుఁ
జెప్పెనని సూతుండు శౌనకాదులతో వెండియు సంతోషా
యత్తచిత్తంబు మెఱయ నిట్లనియె.

170


చ.

కపిలమునీశ్వరుం డడుగఁగా మును శేషుఁడు సమ్మతించి ని
ష్కపటముగాను దత్క్రమము కర్దమపుత్త్రున కొప్పఁ జెప్పె నా
కపరిమితప్రభావుఁ డగు నాకపిలుం డుపదేశ మిచ్చె మీ
కిపు డెఱిఁగించితిన్ వరమునీశ్వరులార తదీయగోప్యమున్.

171


క.

ఈయష్టోత్తరశతమును
బాయని సద్భక్తితోడఁ బారాయణముం
జేయు సుసాత్వికులకు వే
యా యహిగిరివాసుఁ డిచ్చు నవ్యయపదమున్.

172

నైమిశారణ్యమునుండి మునులు వేంకటాద్రికి వచ్చుట

చ.

అన విని శౌనకాదులు మహాద్భుత మందుచు వేంకటేశ్వరుం
గనుఁగొన నిశ్చయించుచు నఖండతరం బగుభక్తిచేత నే