పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

181


గపటములై సెడుఁ గావున
నుపశాంతియ పరమధర్మ ముర్వీస్థలిలోన్.

164


వ.

ఇట్టి జ్ఞానభక్తివైరాగ్యయోగంబులకు ననేకవిఘ్నంబులు
గలుగుచుండు. తద్విఘ్ననివారణంబగుట కొక్కయుపా
యాంతరంబు గల. దదెట్లనిన. "వేంకటాద్రియందు సనకసనం
దనతీర్థం బతిగోప్యంబు, నరులకుఁ దెలియరాకుండు, తత్స
మీపంబునఁ బాపవినాశతీర్థతీరంబు సిద్ధస్థలం బైయుండు,
మార్గశీర్షశుద్ధద్వాదశిదినం బరుణోదయకాలంబున స్వామి
పుష్కరిణీస్నానంబు సేయుచుం ద్రయోదశిదినంబు మొదలు
కొని సనకసనందనతీర్థంబునం గ్రుంకుచు శ్రీ వేంకటేశ్వరుని
దర్శనంబు సేయుచు శ్రీమదష్టాక్షరిమంత్రజపంబుఁ జేయుచు
యోగాభ్యాసంబు సేయుచున్న నెట్టివిఘ్నంబులు రానోపవు,
యోగంబులు సిద్ధించు. పాపవినాశతీర్థసమీపంబున నతి
గుప్తంబైన కాయరసాయనం బనుపుణ్యతీర్థంబు గలదు.
తత్తీర్థంబు పానంబు చేసిన దేహంబు దృఢత్వంబు నొందు.
శ్రీ వేంకటేశ్వరుని కైంకర్యంబు సేయుట పురుషార్ధం బగు. నట్టి
కైంకర్యంబు శక్తివంచకుండై సేయకుండిన స్వామిద్రోహి
యనందగుం గావున ననిశంబు వేంకటేశుని నారాధింపవలయు
నని వరాహస్వామి భూదేవి కుపదేశించినక్రమంబు వ్యాస
మునీంద్రుడు తెలిసి తదుపదేశక్రమంబు నానతిచ్చె. నారీతి
మీకుం జెప్పితి, ననిన సూతుం జూచి శౌనకాదు లిట్లనిరి.

165


ఉ.

సూత మహానుభావ పరిశుద్ధములై తగుయోగమర్మముల్
ఖ్యాతిగ భూమిదేవికి నఖండకృపం గిటి సెప్పఁగా నతి