పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


డంతరాళనాళంబు నిశ్శబ్దం బగు. కంఠముద్రపవనంబున నాళి
నిల్పఁగ సర్వపరిపూర్ణ పరిభావన సిద్ధించు. నీప్రకారంబుగ
నాకుంచిత కంఠనిరోధం బొదవినప్పు డమృతం బగ్నియందుఁ
బడక స్వానుభూతికి లోకువై ప్రాణిని నిశ్చలానందంబు
నొందించు, నదియునుగాక.

112


సీ.

వరయోగి యగువాఁడు వజ్రాసనమునుండి
        నయ మొప్పగను వామనాడివలన
నాలోనఁ గుంభించినట్టి మారుతమును
        మెల్లఁగ విడచి యామీఁద మఱల
దక్షిణనాడిచేతను వెలుపలివాయు
        వును మెల్లఁగను లోని కొనరఁదీసి
యప్పుడు కేశనఖాగ్రపర్యంతంబు
        నరికట్టి కుంభకం బచటఁ జేసి


తే.

వామనాడిని విడువ నవ్వలఁ గపాల
శోధనం బగు శ్రమ వాతబాధ లడఁగు
గొమ్మ యిది సూర్యభేదనకుంభకంబు
కోరి వినుమింకఁ జెప్పెదఁ గుంభకంబు.

113


సీ.

తగ నోరు బంధించి తసముక్కు క్రోవుల
        నుంచి వాయువును బూరించి కంఠ
మున ధ్వని బుట్టించి మొనసి హృదబ్జంబు
        దాఁక లోనికిఁ దీసి తనువునందుఁ
బ్రాణుని గుంభించి పరగ నిడానాడి
        చేతను విడువఁగ శ్లేష్మహరము