పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

163


మృత్యువు గలుగును. తదమృతము నిల్పుటకై మడమచేత
యోనిస్థానంబును లెస్సగ నొక్కిపట్టి గుదము నూర్థ్వముఖ
ముగ నెగయనెత్తి యపానవాయువును మీఁది కాకర్షించి
బలవంతముగ నూర్థ్వంబుగ నాకుంచనంబు సేయ నది మూల
బంధం బగు. దానం జేసి ప్రాణాపానవాయువులును నాద
బిందువులును గూడి యైక్యమై యోగసిద్ధప్రదంబగు
నపానవాయువు మీఁది కెగసి యగ్నియందుఁ బొందుచుండ
నపు డగ్నిజ్వాల వాయువుతోఁ గూడి పొడువుగ వృద్ధియగు,
నపు డగ్ని పురుషవాయువులు ప్రాణవాయువును బొందు. నివ్వి
ధంబున దేహమునందుఁ బుట్టిన యగ్ని ప్రజ్వరిల్ల నందు నిద్రిం
చిన కుండలీశక్తి తపింపఁబడి మేల్కని కట్టెచేఁ గొట్టబడిన
భుజంగస్త్రీవలె నిశ్వాసంబు పుచ్చి చక్కఁగ సుషుమ్నద్వా
రాన బ్రవేశించి శాంతమై బ్రహ్మనాడినడుమఁ బొందు
గనుక తదభ్యాసంబు సేయుచున్న మూలశక్తి యాకుంచితం
బగు, మధ్యశక్తి మేల్కను, నూర్ధ్వశక్తి పాతంబు నొదవుఁ, బవ
నుండు మధ్యమార్గంబుగఁ జననోపు. నదియుంగాక మూలం
బాకుంచితంబై నాభినొత్తిన నది యొడ్డాణబంధం బగు. కం
ఠంబు సంకుచితంబై చుబుకంబు ఱొమ్మునొత్తిన నది జాలం
ధరబంధం బగు. మూలం బాకుంచితం బైనపు డపానవాయు
వెగయనంతన హృదయంబునం బ్రాణంబు దిగి నాభియం దపా
నునిం గలయనప్పుడు కుంచితం బైననాభిని వెనుక నొత్తిన,
ప్రాణాపానంబులు గలసి వెన్నంటిపోవునంతలోఁ గంఠనికుం
చనం బడఁచిన నమ్మారుతమునం బడ్డంబైన కుండలిం బడ
నూకి మధ్యబిలంబును జారఁబడి చిన్మయత్వంబు నొందినప్పు