పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

165


నను జఠరాగ్ని మహావృద్ధియగు ధాతు
        గతరోగములు సెడుఁ గ్రమముగాను


తే.

నడచుచుండిన గూర్చుండి యనుదినంబు
గోప్యముగ నిట్టియజ్ఞాయు కుంభకంబు
క్రమముగను జేయఁదగును సీత్కార మనెడి
కుంభకం బేను జెప్పెదఁ గొమ్మ వినుము.

114


తే.

వనిత నాసాపుటములచేఁ దనరుచుండఁ
బడినసీత్కార మనెడుకుంభకము ముఖము
నందుఁ జేయఁగ నిద్రయు నాఁకలియును
దెలియకుండును స్వచ్ఛందదేహుఁ డగుచు.

115


వ.

అది యెట్లనిన నాడికచేతను జెక్కిళ్లచేతను వాయువును సదా
పానంబుసేయఁగ నతఁ డాఱునెలలకు రోగరహితుఁడై
యోగినీచక్రసమానశక్తిగలవాఁడై రెండవ వామదేవుం
డనఁదగియుండు నిది సీత్కారకుంభకం బగు నింక సీతళి
యనుగుంభకంబు చెప్పెద వినుము.

116


తే.

యోగి రసనంబుచేత వాయువును మెల్లఁ
గాను బూరించి పూర్వప్రకారముగను
కుంభకము చేసి నాసికగోళములను
విడువ బహురోగబాధలు విడచిపోవు.

117


వ.

ఇఁక భస్త్రికాకుంభకంబు చెప్పెదను. పద్మాసనాసీనుఁడై యుదర
గ్రీవంబు చక్కఁగ నిలిపి నోరు లెస్సఁగ మూసి ప్రాణవాయు
వును ముక్కుచేత వ్యాపింపఁజేసి వేగవిడిచి బ్రహ్మరంధ్ర
పర్యంతంబు వ్యాపించిన మేఘధ్వనితోడఁ గూడి వాయువును
హృదయపద్మపర్యంతం బించుకించుక నిండించి విడిచి మఱలఁ