పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

121


జేయఁగా వారిపైఁ బడి వాయకుండఁ
బోరుచును రెండుబలములు ఘోరముగను.

8


వ.

కలసికొని కడునబ్బురంబుగఁ గొంతవడిఁ బోరాడి.

9


క.

జ్వాలాముఖకుముదాదులు
నాలో నెడఁ దాఁకి నట్టహాసముతోడన్
గాలాంతకుసన్నిభులై
యాలం బొనరించి త్రుంచి రసురాంశజులన్.

10


క.

తక్కినయాదనుజాంశజు
లక్కడఁ బడియున్న శవము లటుద్రొక్కుచుఁ బో
నిక్కుచుఁ జని గంధర్వులఁ
గ్రక్కసపడి గొట్టి రమితగదలం దలలన్.

11


క.

అప్పుడు గంధర్వులు గురి
దప్పక శస్త్రాస్త్రములను ధరియించి యిదో
దప్పించుకొనుఁ డటంచుం
జెప్పుచు రిపులడఁగునట్లు చేసిరి కడిమిన్.

12


వ.

అప్పుడు హతశేషులైనచోరులు తమదొరలకుఁ దమబలం
బులుపడిన నికారక్రమంబు నుడువఁ చోరప్రభువులు స్థల
దుర్గ వనదుర్గంబులయందుండి త్రిపురంబులందున్న రాక్షస
బలంబుకైవడి వివిధమాయోపాయంబులు సేయుచు విడి
వడి యార్చుచుఁ గరవాల శూల ముద్గర భిండివాల పరశు
పట్టిస శరచాప పరిఘాద్యనేక సాధనంబులఁ గొని గం
ధర్వబలంబులపైఁబడి యాలం బొనరించుచుండి రప్పుడు భేరీ
ప్రముఖ భయంకర వాద్యఘోషంబులును, గంధేభఘీంకా
రంబులును, దురంగహేషారవంబులును, రథనేమిభీషణ