పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


దక్కించిన పుణ్యాత్ముఁడ
విక్కడ సంతసము నెగడ నెపు డుండుమయా.

6


సీ.

అని పల్కుసుజనుల నాదరించుచుఁ జక్ర
        రాజు తద్భూమికి రాజునొకని
వెదకి పట్టముఁగట్టి విప్రాదిజనులను
        మించిన నెమ్మి రక్షించుమంచు
వానికి నియమించి శ్రీనివాసాద్రికి
        మనుజులు రాఁదగు మార్గములను
దనర నేర్పఱచి యాదారులయందు ధ
        ర్మాత్ముల నుంచి మహాద్భుతముగ


తే.

నచట జయభేరి వేయించి యపుడు వెడలి
కరులు హయములు రథములు కాల్బలములు
మొనసి గొల్వఁగ వాద్యము ల్మొరయుచుండ
శౌర్యకార్యధురీణుఁడై చక్రరాజు.

7


సీ.

సంతోషభరితుఁడై సరవిగ నందందు
        వివిధదుర్మార్గుల వెదకికొనుచుఁ
బరఁగ నాగ్నేయదిగ్భాగంబునకు వచ్చి
        చోరులు విన రణభేరి నచట
మొరయించుచును మున్ను మొఱకులై పాఱుల
        బాధించుచున్నట్టి పాపమతుల
పై దాడివెడలి యార్భటముసేయఁగ వారు
        దైత్యాంశజులు గాన ధైర్య మెసఁగ


తే.

నాయుధంబులు పూని ఘోరాట్టహాస
కలితులై నిల్చి మార్కొని కయ్యమెసఁగఁ